హైదరాబాద్: కశ్మీర్ సమస్యను ద్వైపాక్షికంగా పరిష్కరించుకోలేమని పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అన్నారు. వివాదాస్పద కశ్మీర్ సమస్యపై మధ్యవర్తిత్వం వహించేందుకు సిద్ధంగా ఉన్నానని ట్రంప్ చేసిన వ్యాఖ్యలను పాక్ ప్రధాని స్వాగతించారు. అమెరికా వెళ్లిన ఇమ్రాన్.. అక్కడ ట్రంప్తో భేటీ అయ్యారు. ఆ సందర్భంలో కశ్మీర్ సమస్య గురించి మోడీ తనతో మాట్లాడారని, మధ్యవర్తిత్వం వహిస్తే బాగుంటుందని కోరారని ట్రంప్ అన్నారు. దీంతో ఇది సంచలనంగా మారింది. కశ్మీర్ సమస్యపై ఓ సందర్భంలో జనరల్ పర్వేజ్ ముష్రరఫ్, ప్రధాని వాజ్పేయి తీర్మానం చేసేందుకు అంగీకరించారని, కానీ ఆ తర్వాత రెండు దేశాలు దూరం దూరంగా ఉన్నాయని ఇమ్రాన్ అన్నారు. కశ్మీర్ సమస్య పరిష్కారంలో అమెరికా పెద్ద పాత్ర పోషిస్తుందని, ట్రంప్ పాత్ర మరీ విశేషంగా ఉంటుందని ఇమ్రాన్ తెలిపారు.
Mon Jan 19, 2015 06:51 pm