చెన్నై: జియో ఫోన్ కొనుగోలు చేసే ఏజెన్సీలకు ఉచితంగా హెల్మెట్లు అందిస్తామని ప్రకటించి రూ.1.51 కోట్ల మోసానికి పాల్పడిన ఆ సంస్థ మేనేజర్ను పోలీసులు అరెస్ట్ చేశారు. తిరువణ్ణామలై జిల్లా వందవాసికి చెందిన శ్రీనివాసన్ అదే ప్రాంతంలో మొబైల్ ఫోన్ దుకాణం నడుపుతున్నాడు. కృష్ణగిరికి చెందిన సుధాకర్ జియో సంస్థ ఆరణి బ్రాంచ్ మేనేజర్గా వ్యవహరిస్తున్నారు. మొబైల్ ఫోన్ విక్రయించిన వారికి హెల్మెట్లు ఉచితంగా అందిస్తామని సుధాకర్ ప్రకటన చేశారు. అంతేకాకుండా ఉచిత హెల్మెట్లతో కూడిన మొబైల్ ఫోన్ కొనుగోలుకు అడ్వాన్స్గా రూ.13 లక్షలు చెల్లించాలని కోరారు. దీనిని నమ్మిన శ్రీనివాసన్, అతని స్నేహితుడు ప్రశాంత్ ఆన్లైన్లో నగదును చెల్లించారు. కానీ, సుధాకర్ ఎలాంటి మొబైల్ ఫోన్లను అందించకపోవడంతో అనుమానించిన శ్రీనివాసన్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ వ్యవహారంపై విచారణ చేపట్టిన పోలీసులు, పలువురి ఏజెన్సీల వద్ద జియో ఫోన్లు, ఉచిత హెల్మెట్లు అందిస్తానని ప్రకటించిన సుధాకర్ రూ.1.51 కోట్ల మోసానికి పాల్పడినట్లు తేలింది. దీంతో, జిల్లా ఎస్పీ చక్రవర్తి ఉత్తర్వులతో పోలీసులు సుధాకర్ను అరెస్ట్ చేశారు.
Mon Jan 19, 2015 06:51 pm