అమరావతి: మేనిఫెస్టోలో పొందుపర్చిన అంశాలను అమలు చేయడమే తమ లక్ష్యమని ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. ఏపీ శాసనసభలో ఆయన మాట్లాడుతూ.. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల కోసం చారిత్రాత్మకమైన బిల్లులు తీసుకొచ్చామన్నారు. నమ్మి ఓటు వేసిన ప్రజలకు సేవ చేయాలనుకుంటున్నామన్నారు. ఎక్కడ తమకు పేరు వస్తుందోనని చంద్రబాబు భయపడుతున్నారన్నారు. చంద్రబాబు ఏనాడూ ప్రజల అభివృద్ది కోసం ఆలోచించలేదన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm