చెన్నై: తమిళనాడు రాష్ట్రంలో విద్యుత్ చౌర్యానికి పాల్పడిన వారి నుంచి రూ.69 కోట్ల జరిమానా వసూలు చేసినట్లు విద్యుత్ బోర్డు అధికారులు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా అధిక సంఖ్యలో ఇళ్లు, పారిశ్రామిక వాడలు, దుకాణాలలో గుర్తుతెలియని కొందరు విద్యుత్ చౌర్యానికి పాల్పడుతున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. దీన్ని అడ్డుకొనేలా సైనికులతో కూడిన ప్రత్యేక బృందాన్ని విద్యుత్ బోర్డు ఏర్పాటుచేసింది. 2018-19లో 17 వేలకు పైగా విద్యుత్ చౌర్యం కేసులు నమోదుచేసి సంబంధిత వ్యక్తుల నుంచి రూ.69 కోట్లను జరిమానాగా వసూలుచేసినట్లు అధికారులు తెలిపారు.
Mon Jan 19, 2015 06:51 pm