అమరావతి: తెలుగుదేశం పార్టీ ప్రవర్తించిన విధంగా వైసీపీ ప్రభుత్వం ప్రవర్తించదని వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు అన్నారు. శాసనసభలో మేనిఫెస్టోపై జరుగుతున్న చర్చలో ఆయన మాట్లాడుతూ ఆనాడు టీడీపీ ఏ విధంగా ప్రవర్తించిందో గుర్తించాలన్నారు. తాము ఇచ్చిన హామీలనె మేనిఫెస్టోలో పొందుపర్చామన్నారు. సస్పెండ్ అయ్యేంత వరకు దయచేసి తెచ్చుకోకండని సూచించారు. టీడీపీ సభ్యులు ఇచ్చిన సమయాన్ని వృథా చేస్తున్నారన్నారు. ఏపీ మీద ప్రేమ ఉంటే చంద్రబాబు అమరావతిలో ఇల్లు ఎందుకు కట్టుకోలేదన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm