మెదక్: శివంపేట మండలం శంకర్తండాలో ఇవాళ ఉదయం అగ్నిప్రమాదం సంభవించింది. ఓ పూరిల్లులో గ్యాస్ సిలిండర్ పేలిపోయింది. దీంతో పూరిల్లు పూర్తిగా కాలిపోగా, నలుగురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదస్థలికి చేరుకున్న పోలీసులు.. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. వీరి ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు తెలుస్తోంది.
Mon Jan 19, 2015 06:51 pm