నిజామాబాద్: ఇందల్వాయి మండలం ఎల్లారెడ్డిపల్లిలో దారుణం జరిగింది. తండ్రిని కుమారుడు ప్రశాంత్ హత్య చేశాడు. 4 నెలల క్రితం భార్యను హత్య చేసి జైలుకెళ్లిన ప్రశాంత్ తండ్రి.. ఇటీవలె బెయిల్పై బయటకు వచ్చాడు. అయితే ఇంటికొచ్చిన తర్వాత ఇరుగుపొరుగు వారిని ఇబ్బంది పెడుతున్నాడు. తండ్రి ప్రవర్తన నచ్చని కుమారుడు.. ఆయనను హత్య చేశాడు. అనంతరం పోలీసుల ఎదుట ప్రశాంత్ లొంగిపోయాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Mon Jan 19, 2015 06:51 pm