అమరావతి: ఏపీ అసెంబ్లీ నుంచి టీడీపీకి చెందిన ముగ్గురి ఎమ్మెల్యేల సస్పెన్షన్ అనంతరం అసెంబ్లీ ఛాంబర్లో టీడీపీ ఎమ్మెల్యేలు భేటీ అయ్యారు. శాసనసభలో పార్టీ ఉపనేతలు ముగ్గురిపై సస్పెన్షన్ ఎత్తివేయాలని స్పీకర్ని కోరాలని నిర్ణయం తీసుకున్నారు. అచ్చెన్నాయుడు తన సీటులో కూర్చున్నా సస్పెండ్ ఎలా చేస్తారని సభ్యులు ప్రశ్నించనున్నారు. అన్యాయంగా ముగ్గురని సస్పెండ్ చేశారని సమావేశం భావించింది. దీంతో టీడీపీ ఎమ్మెల్యేలు డిప్యూటీ స్పీకర్ ఛాంబర్కు వెళ్లారు.
Mon Jan 19, 2015 06:51 pm