న్యూఢిల్లీ: కశ్మీర్ సమస్యపై మధ్యవర్తిత్వం వహించమని ట్రంప్ను మోడీ కోరలేదని విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ స్పష్టం చేశారు. రాజ్యసభలో ఈ అంశంపై ఆయన మాట్లాడారు. పాక్తో ఉన్న అన్ని సమస్యలను ద్వైపాక్షికంగానే చర్చిస్తామని మంత్రి తెలిపారు. సీమాతంర ఉగ్రవాదం నిలిపివేస్తేనే చర్చలు సాధ్యమన్నారు. ఇరు దేశాల మధ్య ఉన్న సమస్యలు సిమ్లా అగ్రిమెంట్, లాహోర్ డిక్లరేషన్ ప్రకారమే పరిష్కారం అవుతాయన్నారు. అయితే సభ్యుల నినాదాల మధ్య సభను వాయిదా వేశారు. కశ్మీర్ సమస్య జాతీయ అంశమని, జాతి ఐక్యతకు సంబంధించిన అంశంపై ఒకే గొంతు వినిపించాలని చైర్మన్ వెంకయ్యనాయుడు తెలిపారు.
Mon Jan 19, 2015 06:51 pm