ఢిల్లీ: సీనియర్ ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మి మంగళవారం ఢిల్లీలోని పార్లమెంటు ఆవరణలో కనిపించారు. ఆమె వైసీపీ, బీజేపీ ఎంపీలను కలిసేందుకు పార్లమెంటుకు వచ్చారని సమాచారం. శ్రీలక్ష్మి ప్రస్తుతం తెలంగాణ కేడర్లో విధులు నిర్వహిస్తున్నారు. తెలంగాణ కేడర్లో ఉన్న సీనియర్ ఐఏఎస్ శ్రీలక్ష్మి ఆంధ్రప్రదేశ్కు రావడం దాదాపు ఖరారైంది. ఆమె ఇప్పటికే సీఎం జగన్తో మాట్లాడి ఏపీలో సేవలు అందించేందుకు అవకాశం కల్పించాలని కోరారు. అందుకు ఆయన అంగీకరించారని... కీలకమైన శాఖను అప్పగిస్తానని హామీ కూడా ఇచ్చారని తెలిసింది. శ్రీలక్ష్మి ఓబుళాపురం గనుల కుంభకోణం కేసులో జైలు పాలయ్యారు. జైల్లో అనారోగ్యానికి గురయ్యారు. ఆ తర్వాత నిర్దోషిగా బయటికి వచ్చాక ఐఏఎస్గా కొనసాగుతున్నారు. రాష్ట్ర విభజన తర్వాత శ్రీలక్ష్మిని తెలంగాణ కేడర్కు కేటాయించారు.
Mon Jan 19, 2015 06:51 pm