ఏలూరు: పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం మండలం రామచర్లగూడెం వద్ద విజిలెన్స్ అధికారులు తనిఖీలు చేపట్టారు. అక్రమంగా తరలిస్తున్న 30 టన్నుల రేషన్ బియ్యాన్ని విజిలెన్స్ అధికారులు పట్టుకున్నారు. చింతలపూడి మండలం రాఘవరం నుంచి తూర్పుగోదావరి జిల్లాలోని రైసు మిల్లుకు తరలిస్తుండగా బియ్యం పట్టుబడింది. బియ్యం తరలిస్తున్న లారీని అధికారులు సీజ్ చేసి రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm