అమరావతి: ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కనుసన్నల్లో అసెంబ్లీ నడుస్తోందని టీడీపీ ఎమ్మెల్యే రామానాయుడు పేర్కొన్నాడు. అసెంబ్లీ నుంచి సస్పెండ్ అయిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ శాసనసభను వాళ్ళ సొంత సభలా నడుపుతున్నారని ఆరోపించారు. వైసీపీ ఇచ్చిన క్లిప్పింగ్స్ సభలో చూపిస్తున్నారని.. తాము ఇచ్చిన వాటిని చూపించడం లేదన్నారు. నిరసన తెలిపి వాకౌట్ చేస్తామని స్పీకర్కు చెబితే తమను ఏకంగా సస్పెండ్ చేశారని వాపోయారు. ప్రజల పక్షాన పోరాడుతుంటే తమ గొంతు నొక్కుతున్నారని నిమ్మల రామానాయుడు ఆవేదన వ్యక్తం చేశారు.
Mon Jan 19, 2015 06:51 pm