న్యూఢిల్లీ: గోల్డెన్ గర్ల్ హిమాదాస్పై ప్రశంసల జల్లు కురుస్తోంది. 20 రోజుల వ్యవధిలో ఐదు స్వర్ణాలతో యావత్ భారతం చూపును తనవైపు తిప్పుకున్న ఈ యువక్రీడాకారిణిని ప్రశంసిస్తూ సోషల్ మీడియాను నెటిజన్లు హోరెత్తిస్తున్నారు. హిమ సాధిస్తున్న విజయాలకు దేశమంతా గర్విస్తోందని.. వివిధ టోర్నీలలో ఐదు స్వర్ణ పతకాలు సాధించడం అద్వితీయమంటూ మోడీ ఆదివారం ట్వీట్ చేశారు. ఆమె భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని కోరకుంటున్నానని ఆయన అన్నారు. దీనిపై హిమాదాస్ స్పందించారు. ప్రధాని మోడీకి కృతజ్ఞతలు. ఇలాగే మరింతగా శ్రమిస్తూ.. దేశానికి మరిన్ని పతకాలు సాధిస్తాను అంటూ ప్రధానికి హిమ మాటిచ్చారు. మరోవైపు కృతజ్ఞతలు తెలుపుతూ భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండుల్కర్ చేసిన ట్వీట్కి కూడా హిమ రిప్లై ఇచ్చారు. భారత్కు తిరిగి రాగానే కలిసి.. ఆశీర్వాదాలు తీసుకుంటానని ట్వీట్లో ఆమె పేర్కొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm