తిరుమల: ఆంధ్రప్రదేశ్ రాష్ర్టానికి నూతన గవర్నర్గా నియమితులైన బీబీ హరిచందన్ దంపతులు మంగళవారం తిరుమలకు చేరుకున్నారు. భువనేశ్వర్ నుంచి ప్రత్యేక విమానంలో రేణిగుంటకు చేరుకున్న అనంతరం అక్కడినుంచి రోడ్డు మార్గం ద్వారా తిరుమలకు చేరుకున్నారు. కాగా... గవర్నర్ దంపతులకు తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో సింఘాల్, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తదితరులు ఘనస్వాగతం పలికారు. రేపు బుధవారం బీబీ హరిచందన్ ఏపీ గవర్నర్గా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm