థానే: బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడిన ఓ వ్యకిక్తి థానే కోర్టు మూడేళ్ల జైలు శిక్ష విధించింది. 2018 మే 26న 17 ఏళ్ల బాలిక ఇంటికి తిరిగొస్తుండగా భీవండీ పట్టణానికి చెందిన నదీమ్ అన్వర్ హుస్సేన్ (30) అనే వ్యక్తి ఆమెపై వేధింపులకు పాల్పడ్డాడు. దీంతో అతనిపై ఐపీసీ సెక్షన్ 354 పోక్స్ యాక్ట్ కింద నమోదైంది. ఈ కేసుపై నేడు విచారణ చేపట్టిన థానే జడ్జి ఆర్వీ తంహనేకర్తో కూడిన ధర్మాసనం నదీప్ అన్వర్ హుస్సేన్కు మూడేళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పును వెలువరించింది. నదీమ్ అన్వర్ హుస్సేన్ కు భార్య, పిల్లలు, తల్లి ఉన్నారని.. అతనొక్కడే కుటుంబానికి ఆధారమని తీర్పు విషయమై మరోసారి పరిశీలించాలని అతని తరపు న్యాయవాది కోర్టును విజ్ఞప్తి చేశారు. అయితే ఇలాంటి నేరాలను ఉపేక్షించలేమని, తీర్పును మారిస్తే సమాజానికి తప్పుడు సందేశం పంపినట్లవుతుందని జడ్జి అభిప్రాయపడ్డారు.
Mon Jan 19, 2015 06:51 pm