గుంటూరు : ఉద్యోగ భద్రత కల్పించాలంటూ.. గుంటూరు కలెక్టర్ కార్యాలయం ఎదుట 108 సిబ్బంది మంగళవారం ధర్నా చేపట్టారు. (నిన్న) రాత్రి 8 గంటల నుండి 108 సిబ్బంది మెరుపు సమ్మెను ప్రకటించారు. 108 సిబ్బంది మాట్లాడుతూ.. రెండు నెలల నుంచి జీతాలు అందలేదని వాపోయారు. 8 నెలలు నుండి పెంచిన జీతం లేదని చెప్పారు. ఉద్యోగ భద్రత లేదని ఆవేదన చెందారు. ప్రభుత్వం తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని, అందాల్సిన జీతాలను అందచేయాలని కోరారు.
Mon Jan 19, 2015 06:51 pm