హైదరాబాద్: వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమంతా అభద్రతా భావం వచ్చేసిందన్నారు టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు. అసెంబ్లీలో టీడీపీ సభ్యుల సస్పెన్షన్ పై మీడియాతో మాట్లాడిన చంద్రబాబు ప్రభుత్వంలో అసహనం బాగా పెరిగిపోయిందన్నారు. డిప్యూటీ లీడర్లను అకారణంగా సస్పెండ్ చేస్తే తామెలా ఖాళీగా కూర్చోవాలని ప్రశ్నించిన చంద్రబాబు ఏంచేయాలో టీడీఎల్పీలో అలోచించి నిర్ణయం తీసుకుంటామన్నారు. ముందస్తు ప్రణాళిక ప్రకారమే బీసీ నాయకుడిని సస్పెండ్ చేసి బీసీ బిల్లు ప్రవేశపెట్టాలని చూసారన్న చంద్రబాబు తామేమీ సభకు, ప్రభుత్వం మీద కత్తులు, కటార్లు తీసుకొని వెళ్లడం లేదని వాళ్ళిచ్చిన హామీలనే గుర్తు చేస్తున్నామన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm