న్యూఢిల్లీ: 1984 సిక్కు వ్యతిరేక అల్లర్ల కేసులో సుప్రీంకోర్టు 34 మందికి బెయిల్ మంజూరు చేస్తూ తీర్పునిచ్చింది. సిక్కు అల్లర్ల కేసుకు సంబంధించి ఢిల్లీ హైకోర్టు 34మందికి ఐదేళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. అయితే వీరిలో 33 మంది ఈ తీర్పును సవాలు చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీన్ని విచారించిన అనంతరం వారికి అత్యున్నత న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది. అదేవిధంగా ఈ కేసులో ఢిల్లీ హైకోర్టు 15 మంది నిర్దోషులుగా ప్రకటిస్తూ ఇటీవలే ఇచ్చిన తీర్పుపై మరోసారి వాదనలు వినిపించేందుకు సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చింది.
Mon Jan 19, 2015 06:51 pm