హైదరాబాద్ : పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలపై సచివాలయంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. సమీక్షలో మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ..గ్రామాలు పచ్చదనం, పరిశుభ్రతతో ఉండాలని అధికారులకు నిర్దేశించారు. హరితహారం విజయవంతం చేసిన గ్రామాలకు నిధుల కేటాయింపులో ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు తెలిపారు. మొక్కల సంరక్షణ ఆధారంగానే పంచాయతీ భవనాలు, సీసీ రహదారులు మంజూరు చేస్తామన్నారు. ఉపాధి హామీ నిధుల వినియోగంలో మన రాష్ట్రం ముందుండాలని అధికారులకు సూచించారు. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు సదస్సులకు ఏర్పాట్లు చేయాలి. ప్రతీ గ్రామపంచాయతీలో వైకుంఠధామం కచ్చితంగా నిర్మించాలి. ఉపాధిహామీ పనులు గ్రామపంచాయతీ ఆమోదంతో జరగాలన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm