హైదరాబాద్: కృష్ణానదిలో నదిలో తవ్వకాలపై ఎన్జీటీ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. కృష్ణానది పరీవాహక ప్రాంతాలలో ఇసుక తవ్వకాలపై ఎన్జీటీలో దాఖలైన పిటిషన్ ఈరోజు విచారణకు వచ్చింది. ఎన్జీటీకి దాఖలైన పిటిషన్లపై ఏపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించగా ప్రభుత్వం ఇసుక అక్రమ తవ్వకాలు జరగలేదని, జలరవాణా కోసం ప్రకాశం బ్యారేజీ దగ్గర పూడిక తీశామని తెలిపింది. ఏ ప్రాతిపదికన పూడికతీత చేపట్టారని, పర్యావరణ అనుమతులు తీసుకున్నారా అని ఎన్జీటీ ప్రశ్నించగా.. ప్రభుత్వం పూడికతీతకు అనుమతులు అవసరం లేదని సమాధానమిచ్చింది. దీంతో ఎన్జీటీ రెండు వారాలలో సమగ్ర నివేదిక అందజేయాలని, తదుపరి విచారణ సెప్టెంబర్ 2కు వాయిదా వేసింది.
Mon Jan 19, 2015 06:51 pm