హైదరాబాద్: గండేపల్లి మండలం యల్లమిల్లి గ్రామంలోని చెరువులో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం కనిపించింది. పోలీసులు, స్థానికుల వివరాల మేరకు.. చెరువులో వ్యక్తి మృతదేహం ఉండటాన్ని మంగళవారం ఉదయం స్థానికులు గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అక్కడకు వచ్చిన ఎస్సై తిరుపతిరావు పరిశీలించారు. స్థానికులను విచారించగా, గ్రామానికి చెందిన వ్యక్తి కాదని తెలియడంతో.. ఎస్ఐ విచారణ చేపట్టారు. స్థానికుల వివరాల ప్రకారం.. బీహార్ నుండి కొంతమంది వ్యవసాయ పనులకు వస్తున్నారని, వారిలో ఎవరైనా అయి ఉండవచ్చని అనుమానాలు వ్యక్తపరిచారు. ఎస్సై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Mon Jan 19, 2015 06:51 pm