హైదరాబాద్ : జమ్మలమడుగులో నాటు బాంబుల కలకలం రేగింది. పెన్నానది సమీపంలోని ఇసుక తిన్నెల వద్ద కంప చెట్లను తొలగిస్తున్నారు. జేసీబీ తవ్వకాల్లో బకెట్లు కనిపించాయి. దీంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు బకెట్లను తెరిచి చూడగా 54 నాటు బాంబులు కనిపించాయి. ఈ బకెట్లు ఎవరు పెట్టారు? ఎన్ని రోజుల క్రితం పూడ్చారు? ఇది ఎవరి పని? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు.
Mon Jan 19, 2015 06:51 pm