శ్రీకాకుళం : పాల వ్యాన్, స్కూటీని ఢీకొనడంతో నర్స్ మృతి చెందిన ఘటన మంగళవారం ఆమదాలవలస మండలం జన్నవలస లో చోటు చేసుకుంది. ఆమదాలవలస పాలిపోలమ్మ గుడికి వెళ్లి తిరిగి వస్తుండగా, చిన్న జన్నవలస గ్రామం వద్ద ఉన్న స్పీడ్ బ్రేకర్ వద్ద బండిని స్లో చేస్తుండగా, వేగంగా వస్తున్న పాల వ్యాన్ (ఎపి 30 డబ్ల్యు 558) స్కూటీని ఢీకొంది. స్కూటీ వెనుక కూర్చున్న నర్స్ కిందపడిపోగా, ఆమె తలపై నుండి పాల వ్యాన్ వెళ్లడంతో నర్స్ రోడ్డు పక్కకు తిరగబడి మృతి చెందింది. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకున్నారు. మృతురాలు ఎల్ఎన్ పేట పిహెచ్సి లో పని చేస్తున్న నర్స్ గా గుర్తించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.
Mon Jan 19, 2015 06:51 pm