హైదరాబాద్: చెన్నై నగరంలో పట్టపగలే నడిరోడ్డుపై కాలేజీ విద్యార్థులు కత్తులతో దాడులకు పాల్పడుతూ హల్ చల్ చేశారు. చెన్నైలోని అమింజికరయ్ లో నడిరోడ్డుపై పాచియప్ప కళాశాల విద్యార్థులు రెండు వర్గాలు చీలిపోయి కత్తులతో ఒకరిపై ఒకరు దాడులకు దిగారు. సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు విద్యార్థులను చెదరగొట్టి కొందరిని అదుపులోకి తీసుకున్నారు. గాయపడినవారిని ఆసుపత్రికి తరలించారు.
Mon Jan 19, 2015 06:51 pm