విజయవాడ: ఉద్యోగాల్లో 75శాతం స్థానికులకు అవకాశం కల్పిస్తూ ఏపీ సర్కార్ తీసుకొచ్చిన కొత్త చట్టంపై విజయవాడ ఎంపీ కేశినేని నాని తనదైనశైలిలో విమర్శలు గుప్పించారు. జగన్ చేతిలో అధికారం పిచ్చోడి చేతిలో రాయిలా ఉందని హాట్ కామెంట్ చేశారు. ఇలాంటి చట్టమే రేపటి రోజున ఇతర రాష్ట్రాల్లో కూడా చేస్తే... హైదరాబాద్, బెంగుళూరు, చెన్నై, ముంబై, పూణె, ఢిల్లీ లాంటి చోట్లలో ఏపీ వారికి ఉద్యోగాలు వస్తాయా అని ప్రశ్నించారు. అమ్మ పెట్టలేదు.. అడుక్కు తిననివ్వదు అన్నట్లు పరిస్థితి ఉందని ఘాటుగా వ్యాఖ్యానించారు.
Mon Jan 19, 2015 06:51 pm