న్యూఢిల్లీ : దేశంలోని పలు రాష్ట్రాల్లో భారీవర్షాలు కురుస్తాయని ఢిల్లీలోని భారత వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఉత్తరప్రదేశ్, అసోం, మేఘాలయ రాష్ట్రాల్లో బుధవారం భారీవర్షాలు కురుస్తాయని అధికారులు చెప్పారు. సబ్ హిమాలయన్ రాష్ట్రాలైన పశ్చిమబెంగాల్, సిక్కిం, బిహార్ లతో పాటు కోస్తా కర్ణాటక, కొంకణ్ ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం అధికారులు హెచ్చరించారు. తూర్పు రాజస్థాన్, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, హర్యానా, ఢిల్లీ, ఒడిశా, జార్ఖండ్, నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపుర ప్రాంతాల్లో ఓ మోస్తరు నుంచి భారీవర్షాలు కురవవచ్చని భారత వాతావరణశాఖ బుధవారం జారీ చేసిన బులెటిన్ లో పేర్కొంది. బీహార్, జార్ఖండ్, ఛత్తీస్ ఘడ్, ఒడిశా, పశ్చిమబెంగాల్, సిక్కిం ప్రాంతాల్లో పిడుగులు పడే ప్రమాదముంది.
Mon Jan 19, 2015 06:51 pm