పాట్నా : గత పదిరోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో వరదలు వెల్లువెత్తిన బీహార్ రాష్ట్రంలో వరద బాధితులను ఆదుకునేందుకు భారత వాయుసేన రెండు హెలికాప్టర్లను రంగంలోకి దించింది. బీహార్ రాష్ట్రంలోని దర్బంగా, సీతామర్హి, మధుబనీ జిల్లాల్లో వందలాది గ్రామాలు జలమయం అయ్యాయి. వరదనీటిలో చిక్కుకున్న ప్రజలకు ఆహార పొట్లాలను పంపిణీ చేసేందుకు బుధవారం ఉదయం సెంట్రల్ ఎయిర్ కమాండ్ నుంచి రెండు హెలికాప్టర్లు వచ్చాయి. ఈ హెలికాప్టర్ల ద్వార వరదబాధితులకు ఆహార పొట్లాలను అందిస్తున్నారు. మరోవైపు కర్ణాటక రాష్ట్రంలోని ఉడుపి, కొడగు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో బుధవారం ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలలకు సెలవు ప్రకటించారు.
Mon Jan 19, 2015 06:51 pm