న్యూఢిల్లీ : పాకిస్థాన్ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా అట్టారి - వాఘా సరిహద్దు వద్ద బక్రీద్ నాటి పరిస్థితులే పునరావృతం అయ్యాయి. ఎన్నో ఏళ్లుగా కొనసాగుతున్న సంప్రదాయానికి పాక్ తెరదించింది. మొన్న జరిగిన బక్రీద్ పర్వదినం రోజున బీఎస్ఎఫ్ దళాలు, పాక్ రేంజర్లు స్వీట్లు పంచుకోలేదు. ఇవాళ కూడా దాయాది దేశం స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా కూడా ఇరు దేశాలు స్వీట్లు పంచుకోలేదు. పాక్ రేంజర్లకు స్వీట్లు ఇచ్చేందుకు బీఎస్ఎఫ్ బలగాలు ప్రయత్నించాయి. కానీ పాక్ నుంచి స్పందన లేదు. ఆర్టికల్ 370 రద్దు తర్వాత భారత్తో పాక్ అన్ని సంబంధాలను తెంచేసుకున్న విషయం తెలిసిందే.
Mon Jan 19, 2015 06:51 pm