విజయవాడ: ప్రభుత్వాసుపత్రిలో సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, చికిత్స కోసం వస్తే హేళనగా మాట్లడుతున్నారంటూ రోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. డయాలసిస్ కోసం శ్రీకాంత్ అనే యువకుడు రాత్రి నుంచి పడిగాపులు కాస్తున్నాడు. డయాలసిస్ టెక్నీషియన్ అందుబాటులో లేడు. దీనిపై ఫిర్యాదు చేయగా డయాలసిస్ సెంటర్ తన పరిధి కాదని సూరింటెండెంట్ చెప్పడంతో.. ఉన్నతాధికారులు స్పందించాలని శ్రీకాంత్ వేడుకుంటున్నాడు.
Mon Jan 19, 2015 06:51 pm