హైదరాబాద్: ఓ బావిలో చిక్కుకుపోయిన మొసలిని అటవీ శాఖ సిబ్బంది రక్షించారు. కర్ణాటకలోని బెల్గాం జిల్లా నాగనూర్లో మంచి నీటి బావిలోకి మొసలి చేరడంతో స్థానికులు గమనించి అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. రంగంలోకి దిగిన సిబ్బంది మొసలిని బావిలో నుంచి బయటకు తీసేందుకు చర్యలు చేపట్టారు. దీనిలో భాగంగా మొసలిని బయటకు తీసేందుకు క్రేన్ ఉపయోగించారు. క్రేన్కు అమర్చిన పెద్ద డబ్బాలో అటవీ శాఖ ఉద్యోగి కూర్చొని చాకచక్యంగా బావిలో ఉన్న మొసలిని తాడుతో బంధించి బయటకు తీశారు. బయటకు తీసిన మొసలిని చూసేందుకు స్థానికులు ఎగబడ్డారు. మొసలిని సురక్షిత ప్రాంతంలో వదిలిపెడతామని అటవీ శాఖ సిబ్బంది తెలిపారు.
Mon Jan 19, 2015 06:51 pm