హైదరాబాద్ : రైతులకు పూర్తి నష్టపరిహారం అందిస్తామని వైసీపీ నేత పార్ధసారథి పేర్కొన్నారు. కృష్ణా జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో వైసీపీ నేతలు పర్యటించారు. ఈ సందర్భంగా మీడియాతో పార్ధసారథి మాట్లాడుతూ, సహాయక చర్యల్లో లోపాలు లేవని, ప్రతి ఒక్కరికీ సాయం అందిస్తామని అన్నారు. ఎంపీ బాలశౌరి మాట్లాడుతూ, బందరు పార్లమెంట్ పరిధిలో పదిహేను వేల ఎకరాలకు నష్టం వాటిల్లిందని అన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm