ముంబై: పదకొండు సంవత్సరాల క్రితం సరిగ్గా ఇదే రోజు(18-08-2008) విరాట్ కోహ్లి అంతర్జాతీయ క్రికెట్లోకి ప్రవేశించాడు. దంబుల్లా వేదికగా శ్రీలంకతో జరిగిన వన్డేలో గౌతమ్ గంభీర్తో కలిసి ఇన్నింగ్స్ ఆరంభించాడు. ఈ మ్యాచ్లో ఇండియా 8వికెట్ల తేడాతో ఓడిపోయింది. మొదట బ్యాటింగ్ చేసిన ఇండియా అజంతా మెండిస్, మురళీధరన్ల ధాటికి 147పరుగులకే కుప్పకూలింది. మొదటి మ్యాచ్లో కోహ్లి చేసింది 12పరుగులు మాత్రమే. ఈ మ్యాచ్లో తను నువాన్ కులశేఖర బౌలింగ్లో ఎల్బీగా వెనుదిరిగాడు. లక్ష్య ఛేదనకు బరిలోకి దిగిన లంక 34.2ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి విజయం సాధించింది. కోహ్లి మొదటి మ్యాచ్ అభిమానుకు ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ప్రస్తుతం కోహ్లి అన్ని ఫార్మాట్లకు కెప్టెన్గా విజయవంతంగా కొనసాగుతున్నాడు.
Mon Jan 19, 2015 06:51 pm