విజయవాడ: 'ప్రపంచ ఫొటోగ్రఫీ డే' వేడుకలను విజయవాడ కల్చరల్ సెంటర్లో ఘనంగా నిర్వహించారు.ఆంధ్రప్రదేశ్ ఫొటోగ్రఫీ అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకలకు సభాపతి తమ్మినేని సీతారాం ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పద్మశ్రీ అవార్డు గ్రహీత, ఉత్తరాఖండ్ ఫొటోగ్రాఫర్ అనూప్షాను జీవితసాఫల్య పురస్కారంతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో విజయవాడ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, పలువురు స్థానిక రాజకీయ ప్రముఖులు పాల్గొని అక్కడి చిత్రాలను పరిశీలించారు. మనిషి మనుగడకు.. భారతీయ సంస్కృతి సంప్రదాయాలకు ఈ చిత్రాలు నిలువెత్తు సాక్ష్యాలని సభాపతి తమ్మినేని ఈ సందర్భంగా అన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm