విజయవాడ: టీడీపీ అధినేత చంద్రబాబును హతమార్చేందుకు కుట్ర జరుగుతోందంటూ ఆ పార్టీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ అధికారంలోకి వచ్చాక చంద్రబాబుకు భద్రత తగ్గించారని.. భద్రత పెంచాలని హైకోర్టు చెప్పినా బేఖాతరు చేశారన్నారు. నగరంలో మీడియాతో మాట్లాడిన ఆయన.. కావాలనే చంద్రబాబు ఇంటిని డ్రోన్తో అడుగడుగున విజువల్స్ తీశారని వ్యాఖ్యానించారు. చంద్రబాబును హతమార్చే కుట్రలో భాగంగానే.. డ్రోన్తో విజువల్స్ తీసి రెక్కి నిర్వహించడానికి ప్రయత్నించారని ఆరోపించారు. మంత్రులే రెక్కి నిర్వహిస్తున్నారని తమకు అనుమానంగా ఉందన్నారు. వైసీపీ కుట్రలను భగ్నం చేయడానికి పోరాటం చేస్తానని ఆయన వ్యాఖ్యానించారు. చంద్రబాబును రక్షించుకోవడం కోసం.. అవసరమైతే జగన్ ఇంటి ముందు ఆత్మహత్య చేసుకుంటానన్నారు. చంద్రబాబు భద్రతపై ప్రధాని, హోంమంత్రికి లేఖరాస్తానని.. చంద్రబాబుకు కేంద్రమే రక్షణ కల్పించాలని విజ్ఞప్తి చేశారు. లంక గ్రామాల ప్రజలు ఇబ్బందులను గాలికి వదిలేశారని.. ఏపీలో వరదలు వచ్చి ప్రజలు ఇబ్బందులు పడుతుంటే.. సీఎం జగన్ అమెరికాలో విలాశవంతమైన జీవితం గడుపుతున్నారని వెంకన్న విమర్శించారు.
Mon Jan 19, 2015 06:51 pm