హైదరాబాద్: గుంటూరు జిల్లాలో వరద బాధిత గ్రామాలు ఇంకా నీటిలోనే ఉన్నాయి. లోతట్టు ప్రాంతాలు, లంక గ్రామాల నుండి రాకపోకల పునరుద్ధరణ ఇంకా పూర్తిచేయలేకపోగా పలు ప్రాంతాల ప్రజలకు ఇంకా సహాయక చర్యలు కూడా అందలేదు. అరవింద వారధి వద్ద నదికి పడిన గండితో గ్రామాల్లోకి వరద నీరు రాగా వేలాది ఎకరాలలో పంట నష్టం జరిగినట్లుగా అంచనా వేస్తున్నారు. వరదలకు అరటి, పసుపు, మొక్కజొన్న, కంద, మిర్చి, తమలపాకు, కూరగాయల పంటలకు తీవ్ర నష్టం వాటిల్లగా ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు వేడుకుంటున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm