హైదరాబాద్ : పశ్చిమగోదావరి జిల్లాలో ఉద్యోగాల పేరిట మహిళలను ఓ ముఠా మోసం చేస్తోంది. ఈ మేరకు బాధిత మహిళ మొగల్తూరు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు మొగల్తూరుకు చెందిన నిందితుడు బొండా వెంకటసుబ్బారావు అరెస్టు చేశారు. పాలకొల్లుకు చెందిన ఆకుమర్తి జ్యోతి కీలక నిందితురాలుగా గుర్తించారు. దుబాయ్ లోనే ఉంటున్న జ్యోతి ఈ మోసాలకు పాల్పడుతోందని, దుబాయ్ లో చిక్కుకున్న ముగ్గురు మహిళలను క్షేమంగా తీసుకొచ్చినట్టు పోలీసులు తెలిపారు.
Mon Jan 19, 2015 06:51 pm