విజయవాడ: సీఎం జగన్మోహన్ రెడ్డికి సీపీఐ పార్టీ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ లేఖ రాశారు. గ్రామ వాలంటీర్ల వ్యవస్థతో మీసేవా కేంద్రాల ఉనికి ప్రశ్నార్ధకంగా మారిపోయిందని.. రాష్ట్రవ్యాప్తంగా తొమ్మిదివేల మీసేవా కేంద్రాలున్నాయని, యాభై వేలమంది సిబ్బంది పనిచేస్తున్నారని, ఇప్పుడు అంతా రోడ్డున పడాల్సిన పరిస్థితి వస్తుందన్నారు. మీసేవ కేంద్రాల నిర్వహణపై ప్రభుత్వం స్పష్టమైన వైఖరి తెలపాలని.. గ్రామ సచివాలయంలో సిబ్బందికి తగిన స్థానం కల్పించాలని లేఖలో పేర్కొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm