న్యూఢిల్లీ: జమ్మూ కశ్మీర్లో కాంగ్రెస్ నేతల అరెస్ట్పై ప్రియాంక గాంధీ వాద్రా మండిపడ్డారు. మీడియాతో మాట్లాడటం కూడా నేరమేనా? అంటూ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. నిర్భంధంలో ఉన్నవారికి తమ తమ కుటుంబ సభ్యుల్ని కూడా కలుసుకోనివ్వకపోవడం పట్ల ఆమె తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని విశ్వసిస్తుందా? అని మోదీ, షాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 'ఏ కారణాలచేత జమ్మూ కశ్మీర్లోని కాంగ్రెస్ నేతల్ని అరెస్ట్ చేశారు? మీడియాతో మాట్లాడటం కూడా నేరమేనా? మాజీ ముఖ్యమంత్రుల్ని అరెస్ట్ చేసి 15 రోజులైంది. వాళ్లూ మన రాజ్యాంగం ప్రకారమే కదా ఎన్నికైంది. మన నాయకుల మాదిరే కదా వాళ్లు కూడా. కనీసం వారి కుటుంబ సభ్యలతో మాట్లాడుకునేందుకు కూడా అవకాశం కల్పించడం లేదు. నరేంద్ర మోదీ, అమిత్ షాలకు ప్రజాస్వామ్యంపైన అసలు నమ్మకం ఉందా?' అని ప్రియాంక గాంధీ వాద్రా ట్వీట్ చేశారు.
Mon Jan 19, 2015 06:51 pm