న్యూఢిల్లీ: జమ్మూ కశ్మీర్ ప్రజలు ప్రస్తుతం అయోమయంలో కొట్టుమిట్టాడుతున్నారని, ప్రభుత్వం ఏం చేస్తుందో అర్థం కాని స్థితిలో వారు ఉన్నారని జమ్మూ కశ్మీర్ గవర్నర్ సలహాదారు కె. విజయ్ కుమార్ అన్నారు. అయితే వాస్తవ పరిస్థితులను వారికి తెలియజేసే ప్రయత్నం జరుగుతోందని ఆయన తెలిపారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కశ్మీర్ ప్రజల సమాచార హక్కును పరోక్షంగా గుర్తు చేశారు.
'రాష్ట్రవ్యాప్తంగా ఇళ్లల్లో, వీధుల్లో ఉన్న వ్యక్తులకు ప్రభుత్వం ఏం చేస్తుందో తెలుసుకోలేని అయోమయంలో ఉన్నారు. అయితే ఏం జరుగుందో చెప్పాల్సిన బాధ్యత మాపై ఉంది. ఆ విషయాలు వారికి చెప్పేందుకు అన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఎందుకంటే, మనకు ప్రధానమైన చట్టాలు ఉన్నాయి. అక్కడ సమాచార వ్యవస్థను తగ్గించడం తప్పిదమని విమర్శలు వస్తున్నాయి. అయితే దీనికి కూడా మేము వివరణ ఇస్తాం. వీలైనంత తొందరలో సమాచార వ్యవస్థను పునరుద్దరిస్తాం' అని విజయ్ కుమార్ అన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- Aug 18,2019 05:53PM