న్యూఢిల్లీ: ఇటీవల వెస్టిండీస్తో జరిగిన చివరి వన్డే మ్యచ్లో సెంచరీ చేసిన విరాట్ కోహ్లీ.. ఒక దశాబ్దంలో అన్ని ఫార్మెట్లలో కలిపి 20వేలకు పైగా పరుగులు చేసిన ఏకైక క్రికెటర్గా రికార్డు సృష్టించాడు. కేవలం క్రికెట్లోనే కాకుండా సోషల్ మీడియాలో కూడా విరాట్ కోహ్లీ రికార్డుల పరంపర కొనసాగుతోంది. సోషల్ మీడియాలో టీం ఇండియా సారథి విరాట్ కోహ్లీ తాజాగా సరికొత్త రికార్డు సృష్టించాడు. సోషల్ మీడియాలోని ప్రతి ప్లాట్ఫాం(ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్)లో 30 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్న ఏకైక క్రికెటర్గా విరాట్ గుర్తింపు పొందాడు. సోషల్ మీడియాలో అత్యధిక ఫాలోవర్లు ఉన్న క్రికెటర్లలో సచిన్ రెండో స్థానంలో ఉండగా, టీం ఇండియా మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోనీ మాత్రం మూడో స్థానానికి పరిమితమయ్యాడు. ట్విట్టర్లో సచిన్ను 30 మిలియన్ల మంది ఫాలో అవుతుండగా.. ఫేస్బుక్లో 28, ఇన్స్టాగ్మ్లో 16.5 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. సోషల్ మీడియాలో ఏ మాత్రం యాక్టివ్గా ఉండని ధోనీని ట్విట్టర్లో 7.7, ఫేస్బుక్లో 20.5, ఇన్స్టాగ్రామ్లో 15.4 మిలియన్ల మంది ఫాలో అవుతున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm