హైదరాబాద్ : విద్యుద్ఘాతంతో ఒకరు మృతిచెందగా, మరొకరికి తీవ్రగాయాలైన ఘటన గుంటూరు జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లాలోని భట్టిప్రోలు మండలం పెదపులివర్రు వద్ద వరద నిర్వాసితులకు చేరుస్తున్న పడవకు విద్యుద్ఘాతం తగిలింది. నలుగురు పడవ కార్మికులకు విద్యుద్ఘాతం తగలడంతో ఒకరు మృతిచెందారు. అయితే మృతదేహం నదిలో గల్లంతైంది. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది.
Mon Jan 19, 2015 06:51 pm