హైదరాబాద్: ఆర్థికంగా వెనుకబడిన వారికి 10శాతం రిజర్వేషన్లు ఇస్తే తెలంగాణలో కేసీఆర్ కనీసం దాన్ని వాడుకునేప్రయత్నం చేయట్లేదని లక్ష్మణ్ మండిపడ్డారు. ఇంటికో ఉద్యోగం అన్న కేసీఆర్ మాటమార్చారని, ఊసరవెల్లి కూడా కేసీఆర్ని చూసి సిగ్గుతో తలదించుకుంటుందని లక్ష్మణ్ విమర్శించారు. 3 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు తెలంగాణలో ఖాళీగా ఉన్నాయని, కానిస్టేబుల్ పోస్టులు తప్ప మరేమీ భర్తీ చేయలేదని, కేసీఆర్ యువత ఉసురు పోసుకుంటున్నారని లక్ష్మణ్ విమర్శించారు. అవినీతి, అప్పుల్లో తెలంగాణను నెంబర్వన్ చేశారని, ఆర్టీసీ వేల కోట్ల అప్పుల్లో ఉందని, డిస్కంకు దిక్కులేదన్నారు. తెలంగాణలో వ్యవస్థలు దివాళా తీస్తున్నాయని, ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యలపై ప్రశ్నిస్తే బీజేపీ వాళ్లది రాజకీయం అంటున్నాడు కేసీఆర్.. ఇవన్నీ కేసీఆర్ వైఫల్యాలే అని లక్ష్మణ్ స్పష్టం చేశారు. ప్రశ్నిస్తే తెలంగాణ ద్రోహులు, సమర్థిస్తే తెలంగాణవాదులా? అని లక్ష్మణ్ అన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm