హైదరాబాద్ : మంచిర్యాల జిల్లా నస్పూర్ పట్టణంలోని సీతారాంపల్లి వద్ద గోదావరి నదిలో దూకి రాకేష్ (22) అనే యువకుడు ఆత్మహత్యకు పాల్పడినట్లు సీసీసీ పోలీసులు తెలిపారు. ఆదివారం నదిలో నీటిపై తేలిన శవాన్ని గుర్తించిన పలువురు పోలీసులకు సమాచారం అందించగా ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు శవాన్ని బయటకు తీయించారు. మృతి చెందిన యువకుడు నస్పూర్ పట్టణంలోని క్రిష్ణాకాలనికి చెందిన వ్యక్తి రాకేష్గా గుర్తించారు. మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
Mon Jan 19, 2015 06:51 pm