పట్నా: ఇద్దరు ఎన్ఎస్యూఐ జిల్లా స్థాయి నాయకులపై గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులకు తెగబడ్డారు. బిహార్లోని ఆరా జిల్లాలో ఆదివారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది. బాధితుల్లో ఒకరైన మనీష్ కుమార్ జిల్లా ఎన్ఎస్యూఐ అధ్యక్షుడిగా పనిచేస్తున్నారు. వెంటనే బాధితులిద్దర్నీ స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నారు. ప్రస్తుతం వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. నిందితులు ప్రస్తుతం పరారీలో ఉన్నారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుల కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm