లక్నో: ఉత్తర ప్రదేశ్లోని అలహాబాద్లో 12 గంటల్లో ఆరు హత్యలు జరిగాయి. దీనితో యోగీ ప్రభుత్వం అలహాబాద్ ఎస్పీ అతుల్ శర్మను సస్పెండ్ చేసింది. ప్రభుత్వం అతుల్ శర్మ స్థానంలో సత్యార్థ్ అనిరుధ్ పంకజ్ను నియమించింది. రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి శాంతిభద్రతలు పూర్తిగా దెబ్బతిన్నాయని ప్రతిపక్ష పార్టీ నాయకులు ఆరోపిస్తున్నారు. యోగీ ప్రభుత్వం గూండాలను, భూకబ్జదారులను పెంచి పోషిస్తున్నదని పలువురు నేతలు విమర్శించారు.