న్యూఢిల్లీ: బీజేపీకి సైద్దాంతికి సంస్థ అయిన రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అభిప్రాయాలను ప్రధానమంత్రి నరేంద్రమోడీ కానీ, ఆయన ప్రభుత్వం కానీ ఇకపై గౌరవంచరని కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా అభిప్రాయపడ్డారు. రిజర్వేషన్లపై స్నేహపూర్వక చర్చ జరగాలన్న ఆర్ఎస్ఎస్ ఛీఫ్ మోహన్ భగవత్ వ్యాఖ్యలే ఇందుకు ఉదాహారణ అని ఆమె అన్నారు. ఈ విషయాన్ని ఆమె తన ట్విట్టర్ ఖాతాలో చెప్పుకొచ్చారు. సమాజంలో ఉన్న సమస్యలకు పరిష్కారం స్నేహపూర్వక చర్చల ద్వారానే పరిష్కారించాలని ఆర్ఎస్ఎస్ పేర్కొందా? ఇదే నిజమైతే ఇక ఆర్ఎస్ఎస్ అభిప్రాయాలను మోడీ, ఆయన ప్రభుత్వం ఇకపై గౌరవించదు. ఎందుకంటే తాజా జమ్మూ కాశ్మీర్ అంశం దీనికి పూర్తి విరుద్ధంగా జరిగింది. ఏదైతేనేం.. చాలా ఆసక్తిదాయకం అని ప్రియాంక గాంధీ వాద్రా ట్వీట్ చేశారు.
Mon Jan 19, 2015 06:51 pm