కడప : బైక్ ను కారు ఢీకొనడంతో వ్యక్తి మృతి చెందిన ఘటన మంగళవారం కదిరిలో చోటు చేసుకుంది. కదిరిలో బైక్ పై ఇద్దరు వెళుతుండగా, వెనుక నుండి వేగంగా వచ్చిన కారు (కెఎ 01 ఎంపి 5987), బైక్ ను ఢీకొీంది. ఈ ప్రమాదంలో బైక్ పై ఉన్న ఇద్దరిలో హెడ్ కానిస్టేబుల్ గోరంట్ల మల్లేశ్ మృతి చెందగా, రాముడు అనే కూలీ రెండు కాళ్లు విరిగిపోయాయి. కారులో ఉన్నవాళ్లు కారును అక్కడే వదిలి పరారయ్యారు. గమనించిన స్థానికులు వెంటనే రాముడి ని కడప రిమ్స్ కు తరలించారు. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకున్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.
Mon Jan 19, 2015 06:51 pm