గోరక్పూర్: ఉత్తరప్రదేశ్, గోరక్పూర్లో ద్విచక్ర వాహనాన్ని కారు ఢీ కొట్టింది. రోడ్డు పక్కన ఆగిన ద్విచక్ర వాహనదారుడ్ని ఓ కారు అతి వేగంగా వచ్చి ఢీ కొట్టింది. కారు వేగానికి అక్కడ ఉన్న మరికొంతమంది ఎగిరి పడ్డారు. మోహదీపూర్లో ఈ ఘటన జరిగింది. ప్రమాద దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి. ఈ ఘటనలో పలువురు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు వెంటనే కారు డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారు.
నిన్న బెంగళూరులో ఇలాంటి ప్రమాదమే జరిగింది. ఫుట్పాత్పై ఉన్న టీ స్టాల్ వద్ద కొందరు టీ తాగుతుండగా ఓ కారు అదుపుతప్పి జనంపైకి దూసుకువచ్చింది. టీ స్టాల్ ముందున్నవారందరినీ ఢీ కొట్టడంతో అందరూ చెల్లాచెదురయ్యారు. దృశ్యాలన్నీ సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి. ఈ ప్రమాదంలో పలువురు తీవ్రంగా గాయపడ్డారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- Aug 20,2019 02:08PM