అమరావతి: గోదావరి మిగిల్చిన నష్టం నుంచి ఇంకా తేరుకోక ముందే నదీ పరీవాహక ప్రాంత ప్రజలు మరో షాకింగ్ న్యూస్ వినాల్సి వచ్చింది. గోదావరికి మళ్లీ వరదలు వచ్చే అవకాశముందని ఆర్టీజీఎస్ హెచ్చరించింది. ఇవాళ్టి నుంచి 3 రోజుల పాటు శబరి, ఇంద్రావతి, దిగువ గోదావరి పరివాహక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే సూచనలున్నాయని తెలిపింది. దీంతో గోదావరికి పెద్దమొత్తంలో వదర నీరు వచ్చే అవకాశముందని వెల్లడించింది. ముంపు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. ఎగువ ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాలకు ఇటీవల గోదావరి ఉప్పొంగిన సంగతి తెలిసిందే. లక్షల ఎకరాల్లో పంటలు నీటమునిగాయి. చాలా మంది నిరాశ్రయులయ్యారు. పోలవరం ప్రాజెక్టు పరిధిలోని పలు గిరిజన లంకలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి.
Mon Jan 19, 2015 06:51 pm