అమరావతి: ఆంధ్రప్రదేశ్ నుంచి పెట్టుబడిదారులు వెళ్లిపోతున్నారంటూ సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేయడంపై రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ అయింది. తప్పుడు ప్రచారం చేసే వారిని హెచ్చరిస్తూ ప్రభుత్వం తరఫున రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పత్రికా ప్రకటన విడుదల చేశారు. ఏపీపీ సంస్థ ఏపీని వీడుతున్నట్లు అసత్య ప్రచారం జరుగుతోందని, తప్పుడు వార్తలు ప్రచారం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సీఎస్ హెచ్చరించారు. ఏపీకి పెట్టుబడులు తెచ్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm